Type Here to Get Search Results !

Kerala Bride రాత్రి 9 వరకూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయొచ్చు.. భర్తకు వధువు బంపరాఫర్!

 

Kerala Bride పెళ్లి తర్వాత స్నేహితులతో షికార్లు, మందు పార్టీలకు చెక్ పడటం సహజం. అప్పటి వరకూ స్నేహితులతో ఎంతో సరదాగా గడిపిన వాళ్లు ఒక్కసారి వైవాహిక జీవితంలోకి వెళ్లాకా మారక తప్పదు. కానీ, ఓ వధువు తన భర్త విషయంలో విశాలంగా ఆలోచించింది. పెళ్లి తర్వాత స్నేహితులు దూరం కాకూడదనే ఉద్దేశంతో కొంత వెసులుబాటు కల్పించింది. ఇందుకు ఏకంగా బాండ్ పేపర్ రాసి పెళ్లికి వచ్చిన స్నేహితులను విస్తుపోయేలా చేసింది.



ప్రధానాంశాలు:

  • స్నేహితులతో తిరగడానికి భర్తకు అనుమతి
  • కేరళ వధువు రాసిచ్చిన బాండ్ పేపర్ వైరల్
  • అసోం, తమిళనాడులో ఇలాంటి ఘటన
Kerala Bride ఉద్యోగానికి వెళ్లిన భర్త.. సాయంత్రం ఆరు దాటినా ఇంటికి రాకపోతే భార్య నుంచి ఫోన్లు వెళ్తాయి. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? అని ఆరా తీయడం సహజం. పొరపాటున స్నేహితులు బలవంతపెట్టి మందుకొట్టి వెళ్తే ఇక అతడి పని గోవిందా. కానీ, ఇలాంటి వాళ్లంతా కేరళకు చెందిన ఓ నవవరుడి గురించి తెలిస్తే కుళ్లుకుంటారేమో. ఎందుకంటే పెళ్లిపీటల మీద ఉన్నప్పుడే వధువు ఇచ్చిన ‘వెసులుబాటు’కు అతడు ఎగిరిగంతేశాడు. రాత్రి 9 గంటల వరకూ స్నేహితులతో ఎంచక్కా సరదాగా తిరగొచ్చని.. తాను ఫోన్‌ చేసి విసిగించనని హామీ ఇచ్చింది. కేవలం నోటి మాటతో సరిపెట్టకుండా రూ.50 బాండ్‌ పేపర్‌ మీద రాసి మరీ ఇచ్చింది. దీంతో వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు అవాక్కయ్యారు.

పాలక్కడలోని కంజికోడ్‌కు చెందిన రఘుకు అర్చనతో నవంబరు 5న వివాహం జరిగింది. బ్యాండింటన్ ఆటగాడైన రఘు తన స్నేహితులతో తిరిగొచ్చని వధువు అర్చన బాండ్ పేపర్‌పై రాసి సంతకం చేసింది. వరుడి స్నేహితుల సమక్షంలో ఆమె ఈ లిఖితపూర్వక హామీ ఇవ్వడం విశేషం. దీంతో వారంతా ఆనందంతో గంతులు వేశారు. తర్వాత మలయాళంలో రాసి ఉన్న ఈ బాండ్‌ పేపర్‌ను రఘు స్నేహితులు సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది.

ఇటీవల అసోంలోనూ ఇలాంటి ‘ఒప్పందమే’ జరిగింది. శాంతి ప్రసాద్‌-మింటూ రాయ్‌ పెళ్లి పీటల మీదే ఓ తెల్ల కాగితంపై సంతకాలు చేశారు. పెళ్లి తర్వాత ఇంటి భోజనమే తినాలి.. డ్రెస్‌లు, జీన్స్‌ ఊసే లేకుండా రోజూ తప్పనిసరిగా చీరలను ధరించాలి.. 15 రోజులకోసారి ఆమెను భర్త షాపింగ్‌కు బయటకు తీసుకెళ్లాలి.. పార్టీలకు అనుమతి.. ప్రతి పార్టీలోనూ మంచి ఫోటోలను తీసుకోవడం.. ఆదివారం నాడు భర్త బ్రేక్‌ఫాస్ట్ సిద్దం చేయడం.. రోజూ తప్పనిసరిగా జిమ్‌కు వెళ్లాలని కండిషన్లు పెట్టుకున్నారు. ఇదంతా చూసి పెళ్లికొచ్చిన అతిథులు ముక్కున వేలేసుకున్నారు.

తమిళనాడులోనూ వధువుతో పెళ్లి పీటలపైనే వరుడి స్నేహితులు తమతో వారాంతాల్లో క్రికెట్ ఆడటానికి అనుమతించాలని బాండ్ పేపరుపై హామీ తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన కూడా వైరల్ అయ్యింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad