Type Here to Get Search Results !

విద్యార్థులకు టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి



 విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయటానికి టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సదిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణిత ప్రతిభ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం వల్ల పై చదువుల్లో రాణిష్టకు ఎంతగానో దోహద పడతాయి అన్నారు. సదిశ ఫౌండేషన్ సూర్యాపేట జోనల్ కోఆర్డినేటర్ దా మల్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షలో 834 మంది విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగిందని అందులో 500 కు పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు ఈ పరీక్షలో ఉత్తీర్ అయిన వారికి నగదు బహుమతి కనిష్టం 256 నుండి 25600 రూపాయల వరకు పొందవచ్చు అని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో సదిశ ఫౌండేషన్ విద్యను అందిస్తున్న తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరపు వెంకన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, డిసిసిబి సెక్రెటరీ కళారాణి , సెక్టరుల అధికారి జనార్ధన్, రాంబాబు, వెంకటేశ్వర్లు ప్రతాప్ , తెలంగాణ గణితఫారం రాష్ట్ర కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, అయోధ్య, అశోక్ , మోతిలాల్ , శ్యామ్ , ఎంఈఓ గోపాలరావు సతీష్, ప్రతినిధులు లోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad