Type Here to Get Search Results !

ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి

 


ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు కళాశాలల ప్రినిపాల్స్ తో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ స్పెషల్ సమ్మరి రివిషన్ 20 23 క్రింద 18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన విద్యార్థిని విద్యార్తులు తప్పని సరిగా తమ పేర్లుఓటరుగా నమోదు చేసుకోవాలని, జిల్లా లో అందరు ఓటర్లు నమోదు కావాలని, ప్రత్యేక ఓటరు నాడు కార్యక్రమాలు చేపట్టి అందరు పేరు నమోదు చేసుకునే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యాక్టివ్ గ ఉన్న బాలురు నుండి ఇద్దరు, బాలికల నుండి ఇద్దరిణి లీడర్ లు గ ఏర్పాటు చేసి 18 సం పూర్తి అయిన వారిని ఓటరుగా నమోదు చేసికోవాలని వారికీ అవగాహన కలిపించాలని, ఎవరైతే పేరు నమోదు చేసుకొని ఉంటే వారి మొబైల్ ఫోన్ లో ఎపిక్ కార్డు చెక్ చేయాలనీ తెలిపారు. ఓటరుగా పేరు నమోదు చేయుటకు వారి ఎస్ ఎస్ సి సర్టిఫికేట్ , ఆదార్ కార్డు తో వారి మొబైల్ ఫోన్ ద్వారా నే నమోదు చేయాలనీ అన్నారు. ప్రతి కాలేజీ లో 18 సం. దాటినా ప్రతి విద్యార్ధి పేరు నమోదు చేసుకొని ఉండాలని, వారి స్నేహితులు, పక్క ఇంటి వారు, కుటుంబ సబ్యులు అందరికి ఓటరు నమోదు మరియు ఓటు హక్కు పై అవగాహన కలిపించాలని అన్నారు. ఓటరు నమోదు తో పాటు స్వీప్ యాక్టివిటీస్ కూడా ఉండాలని అన్నారు.

జిల్లా కు సంబంధించిన యువత తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. కళాశాల వారిగా ఎంత మంది ఉన్నారు, ఎంతమంది పేర్లు నమోదు చేసుకున్నారు, ఇంకా ఎంత మంది ఓటు నమోదు చేసుకోవాలని అడిగి తెలుసుకున్నారు. ఇంకా పేర్లు నమోదు చేసుకొని వారు ఉంటే రెండు రోజులలో తప్పనిసరిగా ఓటరు గ నమోదు చేసుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంటర్ కోఅర్దినే టర్ హృదయరాజు, వరలక్ష్మి, ఎం ఏ ఎల్ డి, ప్రియదర్శిని, పి జి సెంటర్, గాయత్రి, ఎస్ వి ఎం , విశ్వేశ్వరయ్య కళాశాలల ప్రిన్సిపాల్స్ , విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad